Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటకలిసిన మానవత్వం - పిల్లోడిని చంపేసి కూలర్లో కుక్కారు..

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (16:40 IST)
కొందరు మనుషుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఫలితంగానే సభ్య సమాజం తలదించుకునే సంఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ క్రూరమైన చర్యకు కొందరు వ్యక్తుల పాల్పడ్డారు. ఐదేళ్ల బాలుడుని హత్య చేసిన కొందరు కిరాతకులు.. మృతదేహాన్ని కూలర్లో కుక్కారు. ఈ కిరాతక చర్య రాష్ట్రంలోని భింద్ జిల్లాలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదేళ్ల బాలుడు ట్యూషన్‌కు వెళ్లాడు. కానీ, ట్యూషన్ సెంటర్‌కు వెళ్లలేదు. పైగా, రాత్రి పొద్దుపోయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేపట్టారు. 
 
ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి అక్కడ చదువుకునే విద్యార్థుల వద్ద ఆరా తీశారు. ఈ బాలుడు ట్యూషన్ సెంటర్ పక్కనే ఉన్న సంతోష్ చౌరాసియా ఇంటికి వెళ్లినట్టు వెల్లడించారు. దీంతో చౌరాసియా ఇంట్లో సోదాలు చేయగా, అక్కడి దృశ్యం చూసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలుడిని చంపేసి కూలర్‌లో కుక్కివుండటాన్ని చూసి విస్తుపోయారు. ఈ దారుణం వెనుక అసలు కారణం ఏంటి, కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక మూఢ నమ్మకాలతో బలిచ్చారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments