Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తారింటికి వెళుతూ నదిలో దూకేసిన నవవధువు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (13:34 IST)
ఆమెకు ఇష్టంలేని పెళ్లి చేశారో లేక వరుడు నచ్చలేదో తెలియదు గానీ.. పెళ్లి మండపం నుంచి అత్తారింటికి బయలుదేరిన నవ వధువు మార్గమధ్యంలో నదిలో దూకేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని అలాపుర్‌కు చెందిన ఓ యువతికి ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకుడితో వివాహమైంది. ఆ తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగానే జరిగింది. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని తన అత్తారింటికి నవ వధువు  బయలుదేరింది. అయితే, షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరినా, డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు.
 
ఆ వెంటనే వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తర్వాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments