Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా వేదికగా 15వ బ్రిక్స్ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (15:32 IST)
బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దక్షిణాఫ్రికా రాజధాని జోహనెన్స్‌బర్గ్‌కు బయలుదేరి వెళ్ళారు. మంగళవారం మొదలయ్యే 15వ బ్రిక్స్ సదస్సు మూడు రోజులు కొనసాగుతుంది. ప్రధాని మోడీ పర్యటన వివరాలను సోమవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. 
 
ఈ సదస్సులో భారత్‌‍‌తోపాటు చైనా కూడా పాల్గొననుండటం విశేషంగా మారింది. మోడీ, చైనా ఆధినేత జీ జిన్‌పింగ్ మధ్య చర్చకు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు ఖ్వాత్రా స్పందిస్తూ చర్చలు, ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన ప్రధాని సదస్సు షెడ్యూల్ తయారవుతోందన్నారు. 
 
బ్రిక్స్ సదస్సు అనంతరం బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్చ్, బ్రిక్స్ ప్లస్ డైలాగ్' అనే పేరిట జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. భారత్- దక్షిణాఫ్రికా దౌత్య సంబంధాలు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన విశేష ప్రాధాన్యత సంతరించుకున్నదని తెలిపారు. 
 
కాగా, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఆయన పర్యటించడం ఇది మూడోసారి. ఆగస్టు 25, సదస్సు ముగిసిన మరుసటిరోజు గ్రీస్ దేశంలో మోడీ పర్యటిస్తారని ఖ్వాత్రా తెలిపారు. ప్రధాని వెంట వ్యాపారుల బృందం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటుందని ఖ్వాత్రా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments