Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా వేదికగా 15వ బ్రిక్స్ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోడీ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (15:32 IST)
బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దక్షిణాఫ్రికా రాజధాని జోహనెన్స్‌బర్గ్‌కు బయలుదేరి వెళ్ళారు. మంగళవారం మొదలయ్యే 15వ బ్రిక్స్ సదస్సు మూడు రోజులు కొనసాగుతుంది. ప్రధాని మోడీ పర్యటన వివరాలను సోమవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. 
 
ఈ సదస్సులో భారత్‌‍‌తోపాటు చైనా కూడా పాల్గొననుండటం విశేషంగా మారింది. మోడీ, చైనా ఆధినేత జీ జిన్‌పింగ్ మధ్య చర్చకు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు ఖ్వాత్రా స్పందిస్తూ చర్చలు, ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన ప్రధాని సదస్సు షెడ్యూల్ తయారవుతోందన్నారు. 
 
బ్రిక్స్ సదస్సు అనంతరం బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్చ్, బ్రిక్స్ ప్లస్ డైలాగ్' అనే పేరిట జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. భారత్- దక్షిణాఫ్రికా దౌత్య సంబంధాలు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన విశేష ప్రాధాన్యత సంతరించుకున్నదని తెలిపారు. 
 
కాగా, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఆయన పర్యటించడం ఇది మూడోసారి. ఆగస్టు 25, సదస్సు ముగిసిన మరుసటిరోజు గ్రీస్ దేశంలో మోడీ పర్యటిస్తారని ఖ్వాత్రా తెలిపారు. ప్రధాని వెంట వ్యాపారుల బృందం బ్రిక్స్ సదస్సులో పాల్గొంటుందని ఖ్వాత్రా వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments