Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన్మోహన్ సింగ్ రికార్డును సమం చేసిన ప్రధాని.. మధ్యతరగతి సొంతింటికల?

Modi
, మంగళవారం, 15 ఆగస్టు 2023 (17:16 IST)
Modi
వరుసగా పదోసారి ఎర్రకోట నుంచి జెండా ఎగురువేయడం ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమం చేశారు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగానూ మరో ఘనత సాధించారు. 
 
గాంధీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్య్రం సాధించామని ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
దేశంలో ప్రస్తుతం 10 వేల జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటిని 25 వేలకు పెంచనున్నామని తెలిపారు. కొన్నాళ్ల కిందట మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే అక్కడ 100 శాతం శాంతి నెలకుంటుందని మోదీ చెప్పారు.
 
ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. 
 
పట్టణాల్లోని దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. రూ.లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తామని ప్రధాని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొద్దింకలను టమోటా-చిల్లీ సాస్‌తో కలిపి తినేసింది.. వీడియో వైరల్