Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తా : డోనాల్డ్ ట్రంప్

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (14:51 IST)
అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తుందని, తాను అధికారంలోకి వస్తే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వచ్చే యేడాది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందుకోసం ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన ఏకంగా భారత్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకం విధిస్తోందని, తనను అధికారంలోకి తీసుకొస్తే న్యూఢిల్లీపై ప్రతీకార పన్ను విధిస్తానని ఒక వార్తా చానెల్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు. 'భారత్ మనపై అత్యంత భారీగా పన్నులు విధిస్తోంది. ఉదాహరణకు హార్లీ-డేవిడ్సన్ బైకుల ఎగుమతిని చూస్తే ఏకంగా 100 శాతం, 150, 200 శాతాల వరకూ సుంకాన్ని విధిస్తోంది. 
 
మన దేశంలో మాత్రం ఎటువంటి పన్ను లేకుండా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. తమ దేశానికి వచ్చి పరిశ్రమను నిర్మిస్తే పన్ను ఉండదని ఆఫర్ ఇస్తోంది. కానీ అది మనకు సమ్మతం కాదు. ఈ విషయంలో నా హయాంలో చాలా గట్టిగానే ఆ దేశంతో పోరాడాను. మీరు ఏమైనా అనుకోండి, వాళ్లు మనపై సుంకం విధిస్తే, మనం కూడా విధించి తీరాల్సిందే' అని ట్రంప్ తేల్చిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments