Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈ 10, 12 పరీక్షా ఫలితాలు విడుదల.. 31,14,821 మంది రాశారు(Video)

Webdunia
గురువారం, 2 మే 2019 (13:15 IST)
సీబీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2019 సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు సీబీఎస్‌ఈడాట్.ఎన్ఐసీడాట్ఇన్ అనే వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీబీఎస్ఈరిజల్ట్స్‌డాట్ఎన్ఐసిడాట్‌ఇన్ అనే వెబ్‌సైట్‌లోనూ పొందవచ్చు.


సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను 2018-19 సంవత్సరానికి గాను.. ఫిబ్రవరి-మార్చి 2019 నెలల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
దేశ వ్యాప్తంగా 31,14,821 మంది విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలను రాశారు. ఇందులో 28 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. ఈ పరీక్షలు 4,974 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. ఇంకా విదేశాల్లో 78 సెంటర్లలో ఈ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించింది.

ఇందులో ఇంటర్ విద్యార్థులు మాత్రం 13లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12 ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ సీబీఎస్‌ఈడాట్.ఎన్ఐసీడాట్ఇన్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. 
 
ఈ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా సీబీఎస్‌ఈడాట్ఎగ్జామ్‌రిజల్ట్స్‌డాట్‌నెట్, సీబీఎస్‌ఈరిజల్ట్స్‌డాట్‌ఎన్ఐసి‌డాట్ఇన్, రిజల్ట్స్‌డాట్‌జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌సైట్లలో కూడా ఫలితాలను పొందవచ్చునని సీబీఎస్ఈ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments