Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్క తడుపుతున్నాడని.. బాలుడి మర్మాంగంపై వాతలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:10 IST)
బాలుడు పక్క తడుపుతున్నాడనే కారణంతో పైశాచికంగా ప్రవర్తించారు ఆ దుర్మార్గులు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారు.. బాలుడి పట్ల క్రూరంగా వ్యవహరించారు ఆ తల్లిదండ్రులు. ఇలా చేసిన ఓ వ్యక్తి, అతని రెండో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. బాలుడి బయోలాజికల్ తల్లి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. థానేలోని వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన రెండో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు తన మొదటి భార్యకు పుట్టిన కొడుకును(9) తన వద్దే ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రోజు రాత్రి సమయంలో ఆ బాలుడు పక్క తడిపేస్తున్నాడని ఆగ్రహం తెచ్చుకున్నారు. తెలిసి తెలియక చేసిన తప్పుకు అతన్ని దారుణంగా కొట్టారు. బాలుడి మర్మాంగంపై వాతలు కూడా పెట్టి పశువుల్లా ప్రవర్తించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న బాలుడి అసలు తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకుపై జరిగిన దాడి గురించి పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ చేయలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments