Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ కంపెనీలో లైంగిక వేధింపులు నిజమే... నిర్ధారించిన కోర్టు

దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:13 IST)
దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది. అంతేనా, ఆ కంపెనీలో లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని బాంబే హైకోర్టు నిర్ధారిస్తూ, రూ.50 వేల జరిమానాను విధించింది.
 
కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి విశాఖ విధివిధానాల ప్రకారం కమిటీని నియమించని వోడాఫోన్‌పై ఈ జరిమానాను విధిస్తున్నామని, ఈ డబ్బు యుద్ధం వితంతువుల అసోసియేషన్‌కు జమ చేయాలని న్యాయమూర్తులు అమ్జాద్ సయ్యద్, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన బెంచ్ తీర్పిచ్చింది. 
 
ఓ మాజీ ఉద్యోగిని వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఆమెను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేధించాడని, తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కోర్టు విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం