Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (19:31 IST)
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. వీరిలో 35 నుంచి 40 మంది మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, ఈ విమానంలో లోపం ఉన్నట్టు ముందే ఓ విమాన ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిరిండియా సంస్థకు సమాచారం కూడా చేరవేశాడు. 
 
అయితే, ఈ విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్‌కు చేరుకోవాల్సివుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కాడు. అతడు అహ్మాదాబాద్‌లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 
 
మరోవైపు, యేడాది వ్యవధిలో ఇదే విమానంలో రెండుసార్లు సాంకేతిక సమస్య తలెత్తినట్టు సమాచారం. 2024 జూన్ 6 తేదీన, డిసెంబరు నెలలో ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ కూడా రాసింది. అయితే ఈ లేఖను ఎయిరిండియా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించింది. చివరగా మూడోసారి అంటే జూన్ 12వ తేదీ గురువారం ఈ ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. పైగా ఈ విమానం చాలాకాలం నాటిగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments