కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (19:31 IST)
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. వీరిలో 35 నుంచి 40 మంది మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే, ఈ విమానంలో లోపం ఉన్నట్టు ముందే ఓ విమాన ప్రయాణికుడు సందేహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా ఎయిరిండియా సంస్థకు సమాచారం కూడా చేరవేశాడు. 
 
అయితే, ఈ విమానం న్యూఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్‌కు చేరుకోవాల్సివుంది. ఆకాష్ అనే వ్యక్తి న్యూఢిల్లీలో ఈ విమానం ఎక్కాడు. అతడు అహ్మాదాబాద్‌లో దిగిపోయాడు. ఆ క్రమంలో ఈ విమానంలో లోపం ఉందంటూ అతడు ముందే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 
 
మరోవైపు, యేడాది వ్యవధిలో ఇదే విమానంలో రెండుసార్లు సాంకేతిక సమస్య తలెత్తినట్టు సమాచారం. 2024 జూన్ 6 తేదీన, డిసెంబరు నెలలో ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యపై ఎయిరిండియాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేఖ కూడా రాసింది. అయితే ఈ లేఖను ఎయిరిండియా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరించింది. చివరగా మూడోసారి అంటే జూన్ 12వ తేదీ గురువారం ఈ ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. పైగా ఈ విమానం చాలాకాలం నాటిగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments