Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి ఎంపీకి వీడని కష్టాలు... వారం రోజుల్లో కూల్చివేయాలంటూ...

Webdunia
శనివారం, 21 మే 2022 (19:36 IST)
మహారాష్ట్రలోని అమరావతి బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఇప్పటికే హనుమాన్ చాలీసా పఠనంపై చెలరేగిన వివాదంలో అరెస్టు అయిన నవనీత్ కౌర్ దంపతులు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఇపుడు మరో కష్టం వచ్చిపడింది. 
 
ముంబై నగర పరిధిలోని ఖర్ ఏరియాలో నవనీత్ కౌర్ ఇంటిలో కొంతభాగం అక్రమంగా నిర్మించారంటూ ముంబై నగర పాలక సంస్థ ఆమెకు నోటీసులు జారీచేసింది. ఈ అక్రమ నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చివేయాలని లేనిపక్షంలో తామే కూల్చివేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే హనుమాన్ చాలీసా పఠించాలని డిమాండ్ చేసిన కౌర్‌ అందుకు ఆయన సమ్మతించకపోతే ఆయన ఇంటి ముందు బైఠాయించి హనుమాన్ చాలీసాను పఠిస్తానంటూ హెచ్చరికలు చేశారు. 
 
ఈ క్రమంలో సీఎం ఇంటికి వెళతారన్న అనుమానంతో కౌర్ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ దంపతులకు పది రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పది రోజుల పాటు వారు జైలు జీవితం గడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments