ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారట...

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు హారాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు

Webdunia
శుక్రవారం, 30 మార్చి 2018 (10:11 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు హారాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. వీరికితోడు ఇపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా జతకలిశారు. 
 
అయితే, కమలనాథుల ప్రచారపర్వంలో అపశ్రుతులు చోటుచేసుకోవడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. కర్ణాటక రాష్ట్రంలో దేవనగిరి జిల్లాలో బీజేపీ చేపట్టిన ప్రచార ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అమిత్ షా ప్రసంగాన్ని అనువదించిన ప్రహ్లాద్ జోషి 'ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు... దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు... దేశాన్ని ఆయన నాశనం చేయడం ఖాయం' అంటూ పేర్కొన్నారు. 
 
అమిత్ షా హిందీ భాషలో చేసిన ప్రసంగాన్ని కర్ణాటక బీజేపీ నేత తప్పుగా అనువదించడంతో ర్యాలీకి వచ్చిన ప్రజలు, నేతలు విస్తుపోయారు. వాస్తవంగా అమిత్ షా సిద్ధరామయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, యడ్యూరప్పకు ఓటేసి మోడీపై అభిమానాన్ని చాటుకోవాలని కోరగా అనువాదకుడు పొరపాటుగా చేసిన అనువాదంతో ర్యాలీలో కలకలం చెలరేగింది. గతంలోనూ 'అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాలకు పోటీపెడితే యడ్యూరప్ప సర్కారే నంబర్‌ వన్‌ అవార్డును సాధిస్తుంది' అని అమిత్ షా వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments