Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:50 IST)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ఈ నెలాఖరున కొత్త అధ్యక్షుడు ఎంపిక జరుగనుంది. ఈ ఎన్నిక దాదాపు 10 నెలలుగా పెడింగ్‌లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడుని ఎన్నుకోవాలని బీజేపీ భావిస్తోంది. వాస్తవానికి మార్చి 15వ తేదీ నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి వుంది. అయితే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. 
 
కాగా, బీజేపీ ఇప్పటికే 13 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగించి 13 మంది రాష్ట్ర అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను మరో వారం రోజుల్లో ప్రకటించాల్సి వుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడుని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. పార్టీ నియమావళి ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడుని ఎన్నుకోవాలంటే 50 శాతం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాల్సివుంది. అంతకుమందు బూత్, మండల, జిల్లాస్థాయి ఎన్నికలు నిర్వహించాలి. 
 
కాగా, ప్రస్తుతం చీఫ్‌గా ఉన్న జేపీ నడ్డా గత 2019 నుంచి కొనసాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆయన పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడగించారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో జాతీయ అధ్యక్షుడి ఎన్నికను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే, బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అంత సులభం కాదు. అనేక సామాజిక, రాజకీయ సమీకరణాలను బేరీజు వేయాల్సివుంటుంది ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అగ్రనేతలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments