Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ సోకిన రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి (2) అనే చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో గత నెలలో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం ఆమె చనిపోయింది. 
 
అయితే, ఆమెలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు శాంపిల్స్‌న పూణెలోని వైరాలజీ పరిశోధనా కేంద్రానికి పంపించారు. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన నివేదిక ఆస్పత్రికి చేరింది. ఈ పరీక్షల్లో జ్యోతికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి అనేక కోళ్లు మృత్యువాతపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments