Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళకు మూడోసారి గర్భం.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:56 IST)
పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. అదే పురుషులకు అయితే, వ్యాసక్టమీ శస్త్రచికిత్స చేస్తారు. అయితే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ మూడోసారి కూడా గర్భందాల్చింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. 
 
ఈ గ్రామంలోని గైఘాట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధిత మహిళ గత 2015లో కు.ని. ఆపరేషన్ చేయించుకుంది. ఆమె భర్త హర్యానాలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ మహిళ ఆర్థిక పరిమితుల కారణంగా ఎక్కువ మంది పిల్ల వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ముందుకు వచ్చింది. 
 
అయితే, తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెండుసార్లు గర్భందాల్చాలని మహిళ వాపోతుంది. ఇపుడు మళ్లీ మూడోసారి తాను గర్భందాల్చానని తెలిపింది. దీంతో వైద్యులు గర్భవతిని పరీక్షించారు. 
 
కాగా, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక గర్భందాల్చడంతో 2018వ సంవత్సరంలో జిల్లా మేజిస్ట్రేట్ ఆ మహిళకు ఆరు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు కూడా. ఇపుడు మళ్లీ మరోమారు గర్భందాల్చడం కలకలం సృష్టిస్తుంది. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జ్ సివిల్ సర్జన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments