Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య గొడవ - ట్రిపుల్ మర్డర్ - ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరకు ముగ్గురి హత్యకు.. ఓ ఆత్మహత్యకు దారితీసింది. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం యూపీలోని బల్లియా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బల్లియా జిల్లా బన్స్‌‍దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సభ దేవ్‌డిహ్‌లో తోటలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు హత్యకు గురైనట్టు గుర్తించారు. వీరి గొంతులను పదునైన ఆయుధంతో కోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతదేహాలకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు దేవ్‌డిహ్‌కు చెందిన మోహన్‌ రాయ్ కుమారుడు శ్రవణ్ రామ్‌గా గుర్తించారు. అతని భార్య శశికళా దేవి (35), వారి ఇద్దరు పిల్లలను శ్రవణ్ పదునైన ఆయుధంతో హత్య చేసి, ఆపై శ్రవణ్ రామ్ బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుందని, దీంతో ఆవేశానికి లోనైన శ్రవణ్ రామ్... ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments