యాసంగి సీజన్‌ రైతు బంధు విడుదలకు సీఎం రేవంత్ సమ్మతం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధుల విడుదలకు గత ప్రభుత్వం ప్రయత్నించినా అనివార్య కారణాల వల్ల నిధుల విడుదల సాధ్యంకాలేదు. ఇపుడు ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను పంట పెట్టుబడి సాయం కింద రిలీజ్ చేసేలా ఆయన సూచించారు. 
 
రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరారు యేటా రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో బీడు భూములు, భూస్వాములకు కూడా రైతు బంధు పథకం కింద వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారని, వీటన్నింటిపై సమీక్షించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని పలువురు కాంగ్రెస్ మంత్రులు, నేతలు ప్రకటించారు. 
 
అయితే, ఇప్పటికిపుడు రైతు భరోసా అమలుకు రూ.11 వేల కోట్లు అవసరమవుతాయని వార్తలు వచ్చాయి. ఆ మొత్తం ఖజానాలో లేకపోవడంతో రైతు భరోసా నిధులు ఇప్పటిలే విడుదల కావంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments