Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త.. భర్తను వదిలేసి డుం డుం డుం

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:25 IST)
women marriage
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఇద్దరు మహిళల వివాహానికి సంబంధించిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త భర్తను వదిలేసింది. అంతే మేనకోడలిని వివాహం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గత మూడేళ్లుగా నడుస్తోంది. 
 
మేనకోడలికి వేరే చోట పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అత్త పెళ్లి నిర్ణయం తీసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బెల్వా నివాసి అత్త సుమన్, మేనకోడలు శోభ ఇద్దరూ కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌లోని ససముసాలోని దుర్గా భవాని ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వింత వివాహం చర్చనీయాంశంగా మారింది. 
 
ఆలయంలో వివాహ వేడుకల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మెడలో మంగళసూత్రం కట్టుకున్నారు. ఆపై సింధూర్ ధరించి, అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు. ఎప్పటికీ ఒకరికొకరు అండగా వుంటారని వాగ్ధానం చేసుకున్నారు. 
 
"పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి జీవిస్తాం, చనిపోతామని ప్రమాణం చేశాం." అంటూ చెప్పారు.  సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేయడం ద్వారా తమ పెళ్లి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, కలకాలం కలిసి ఉంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments