Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త.. భర్తను వదిలేసి డుం డుం డుం

సెల్వి
మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:25 IST)
women marriage
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఇద్దరు మహిళల వివాహానికి సంబంధించిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త భర్తను వదిలేసింది. అంతే మేనకోడలిని వివాహం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గత మూడేళ్లుగా నడుస్తోంది. 
 
మేనకోడలికి వేరే చోట పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అత్త పెళ్లి నిర్ణయం తీసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బెల్వా నివాసి అత్త సుమన్, మేనకోడలు శోభ ఇద్దరూ కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌లోని ససముసాలోని దుర్గా భవాని ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వింత వివాహం చర్చనీయాంశంగా మారింది. 
 
ఆలయంలో వివాహ వేడుకల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మెడలో మంగళసూత్రం కట్టుకున్నారు. ఆపై సింధూర్ ధరించి, అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు. ఎప్పటికీ ఒకరికొకరు అండగా వుంటారని వాగ్ధానం చేసుకున్నారు. 
 
"పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి జీవిస్తాం, చనిపోతామని ప్రమాణం చేశాం." అంటూ చెప్పారు.  సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేయడం ద్వారా తమ పెళ్లి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, కలకాలం కలిసి ఉంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments