Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజు ఆదాయం రూ.500 : రూ.37.5 లక్షల పన్ను బకాయి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:09 IST)
ఆదాయపన్ను శాఖ పంపించిన పన్ను నోటీసుతో ఓ చిరు వ్యాపారి బెంబేలెత్తిపోయాడు. ఈ చిరు వ్యాపారి ఆదాయం రోజుకు రూ.500 మాత్రమే. కానీ, రూ.37.5 లక్షల ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. దీంతో ఆ వ్యాపారి బెదిరిపోయాడు. 
 
బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, రోజుకు రూ.500 సంపాదిస్తున్న ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసును చూసి భయంతో వణికిపోయాడు. దీంతో ఆయన సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
 
గిరీష్‌ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ప్రాథమికంగా ఇది మోసం కేసుగా అనిపిస్తోంది అని అలౌలీ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురేంద్ర కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారు తన పేరు మీద జారీ చేసిన పాన్ నంబర్‌కు ఈ నోటీసులు వచ్చినట్టు తెలిపారు. 
 
గిరీష్ ఢిల్లీలో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నాడని, అక్కడ ఒకప్పుడు టౌట్ ద్వారా పాన్ కార్డు కోసం ప్రయత్నించారని చెప్పాడు. ఎక్కడో తప్పు జరిగడం వల్ల నోటీసు వచ్చిందని తెలిపారు. అంతేకాదు, రాజస్థాన్‌కు చెందిన ఓ కంపెనీతో గిరీష్‌కు సంబంధం ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. 'కానీ అతను ఎప్పుడూ ఆ స్థితికి రాలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments