Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజు ఆదాయం రూ.500 : రూ.37.5 లక్షల పన్ను బకాయి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (10:09 IST)
ఆదాయపన్ను శాఖ పంపించిన పన్ను నోటీసుతో ఓ చిరు వ్యాపారి బెంబేలెత్తిపోయాడు. ఈ చిరు వ్యాపారి ఆదాయం రోజుకు రూ.500 మాత్రమే. కానీ, రూ.37.5 లక్షల ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు పంపించింది. దీంతో ఆ వ్యాపారి బెదిరిపోయాడు. 
 
బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, రోజుకు రూ.500 సంపాదిస్తున్న ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్‌కు ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసును చూసి భయంతో వణికిపోయాడు. దీంతో ఆయన సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
 
గిరీష్‌ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ప్రాథమికంగా ఇది మోసం కేసుగా అనిపిస్తోంది అని అలౌలీ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పురేంద్ర కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారు తన పేరు మీద జారీ చేసిన పాన్ నంబర్‌కు ఈ నోటీసులు వచ్చినట్టు తెలిపారు. 
 
గిరీష్ ఢిల్లీలో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నాడని, అక్కడ ఒకప్పుడు టౌట్ ద్వారా పాన్ కార్డు కోసం ప్రయత్నించారని చెప్పాడు. ఎక్కడో తప్పు జరిగడం వల్ల నోటీసు వచ్చిందని తెలిపారు. అంతేకాదు, రాజస్థాన్‌కు చెందిన ఓ కంపెనీతో గిరీష్‌కు సంబంధం ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు. 'కానీ అతను ఎప్పుడూ ఆ స్థితికి రాలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments