Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురి మృతి

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (13:20 IST)
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. థానే జిల్లా భివాండి ప్రాంతంలో ఓ పాత భవనం కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ శిథిలాల నుంచి 12 మంది సురక్షితంగా రక్షించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. మృతులను నవనాథఅ సావంత్ (40), లక్ష్మదేవి రవి మటో (26), సోనా ముఖేశ్ (5)లుగా ఉన్నారు. 
 
మహారాష్ట్రలోని థానే జిల్లాలో భివాండిలో వర్ధమాన్ కాంపౌండ్‌లో మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఆ సమయంలో కింద అంతస్తులో పని చేస్తున్న కార్మికులు, రెండో అంతస్తులో నివసిస్తున్న కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకు పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో దాదాపు 22 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. 
 
మంత్రి కపిల్ పాటిల్, థానె కలెక్టర్ అశోక్ సింగరే, అసిస్టెంట్ కమిషనర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments