Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త కుప్పలో రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (11:29 IST)
దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరంలో చెత్త కుప్పలో ఏకంగా రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు బయటపడటం స్థానికంగా కలకలం రేగింది. మొత్తం రూ.23 నోట్ల బండిల్స్‌ ఈ చెత్త కుప్పలో కనిపించాయి. సల్మాన్ షేక్ అనే వ్యక్తి నగర శివారులో ఈ నెల ఒకటో తేదీన చెత్త తొలగిస్తుండగా, ఈ నోట్లు కనిపించడంతో ఆయన విస్తుపోయాడు.
 
ఆ తర్వాత ఈ నోట్లను ఇంటికి తీసుకెళ్లాడు. నవంబరు 5వ తేదీన ఆ మొత్తాన్ని తాను పని చేసే కంపెనీ యజమాని బొప్పాకు అప్పగించాడు. ఆ తర్వాత బొప్పా, స్థానిక సమాజిక కార్యకర్త కలిముల్లాతో కలిసి వెళ్లి బెంగళూరు పోలీసు కమిషనరును కలిసి విషయాన్ని వివరించారు. 
 
దీంతో, ఆయన కేసు దర్యాప్తు చేయమని హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. కాగా, ఈ నోట్లపై రకరకాల రసాయనాలు పూసి ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారు ఈ నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు పోలీసులు వీటిని ఆర్బీఐకి పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments