Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారుడి పంట పండింది.. వేలంలో రూ.13 లక్షలు పలికింది..

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (11:17 IST)
Fish
పశ్చిమ బెంగాల్‌‌లో కూడా ఓ మత్స్యకారుడి పంట పండింది. తన వలలో పడిన చేప భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఏకంగా లక్షల పలకడంతో అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. ఈస్ట్ మిడ్నాపూర్‌కు చెందిన ఓ జాలరి అందరిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లాడు. 
 
ఐతే అతడి వలకు తెలియా భోలా జాతికి చెందిన భారీ చేప చిక్కింది. దాని బరువు ఏకంగా 50 కేజీలు ఉంది. అంత పెద్ద చేప చిక్కడంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేవు. అందులోనూ అది 'తెలియా భోలా' చేప కావడంతో.. పండగ చేసుకున్నాడు.
 
50 కేజీల ఆ భారీ చేపను తూర్పు భారతదేశంలో అతి పెద్ద చేపల వేలం కేంద్రమైన దిఘా మోహన ఫిష్ ఆక్షన్ సెంటర్‌లో వేలం వేశారు. 
 
చివరకు దక్షిణ 24 పరగణాల జిల్లా నైనాన్ ప్రాంతానికి చెందిన శివాజీ కబీర్.. భారీ రేటు పెట్టి.. దానిని దక్కించుకున్నాడు. కిలోకు రూ.26వేల చొప్పున..13 లక్షలు చెల్లించి.. కొనుగోలు చేశాడు. వాస్తవానికి ఆ చేప బరువు 55 కేజీలు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments