Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులను కాదు.. ముఖ్యమంత్రి మమతను చెంప దెబ్బలు కొట్టాలి : బెంగాల్ చీఫ్

వరుణ్
మంగళవారం, 30 జనవరి 2024 (13:19 IST)
విద్యార్థులు చదువుల్లో రాణించలేకపోవడం వారి తప్పుకాదని, విద్యావ్యవస్థను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భ్రష్టు పట్టించారని, అందువల్ల ఆమె చెంపలు పగులగొట్టాలని భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం మమతా బెనర్జీ భ్రష్టుపట్టించారని ఆరోపించారు. మన పిల్లలు చదువుల్లో రాణించకపోవడం వారి తప్పు కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లన్ని కొట్టడానికి బదులు ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెంపలు పగులగొట్టాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకాంత మజుందరా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు, సుకాంత చేసిన వ్యాఖ్యలపై అధికార టీఎంసీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి, భౌతిక దాడులకు ఆయన ప్రేరేపిస్తున్నారంటూ ఆరోపించారు. తక్షణం సీఎం మమతతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సుకాంత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాగా, సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం మంగళవారం రాజధాని కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments