అందమైన భార్య, ఉదయం నుంచి ఫోన్లో చాటింగ్, అనుమానంతో భర్త

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (17:28 IST)
మూడుముళ్ల బంధానికి అనుమానం ముల్లు గుచ్చుకుంది. క్షణికావేశం పిల్లలకు తల్లిని దూరం చేసింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. భవిష్యత్తు చీకటిగా మారింది. భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా జీసస్‌నగర్‌లో జరిగింది. కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని నంచెర్ల గ్రామానికి చెందిన కవితను, అదే ప్రాంతానికి చెందిన సంతోష్ 13 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
 
అనంతపురంలో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. జీసస్‌నగర్‌లో స్థిరపడ్డాడు. సంసారం సాఫీగా సాగుతుంది. ఇంతలోనే కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు ఇటీవల తరచూ ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడు. గత ఏడాదిలో కరోనా వ్యాప్తి చెందటంతో కవిత ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. 
 
ఆరు నెలల తర్వాత భర్త వెళ్లి అనంతపురానికి తీసుకొచ్చాడు. తరచూ ఫోనులో మాట్లాడటంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపారు. కానీ భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య ఫోన్లో మెసేజ్‌లు, చాటింగ్‌లు చూసి మరింత కోపంతో ఊగిపోయాడు సంతోష్. లుంగీని గొంతుకు బిగించి చంపేసి అనంతరం పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments