Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠిండాలో మళ్లీ కాల్పుల మోత.. జవాను మృతి

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:32 IST)
పంజాబ్ రాష్ట్రంలోని బఠిండాలోని సైనిక స్థావరంలో మళ్లీ కాల్పుల శబ్దం వినిపించింది. ఈ కాల్పులు జరిగిన కొన్ని గంటల్లోనే మరో జవాను ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం సాయంత్రం ఓ జవాను బుల్లెట్‌ గాయంతో మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
 
అయితే, ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో అతడు మరణించి ఉంటాడని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. మృతుడిని లఘు రాజ్‌ శంకర్‌గా గుర్తించారు.
 
కాగా, బఠిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆగంతకులు జరిపిన దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం వినిపించగానే సత్వర ప్రతిస్పందన బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. 
 
దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం వేట కొనసాగుతోంది. కుర్తా పైజామా ధరించి, ముఖానికి మాస్కులతో వచ్చిన దుండగులు ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మరో జవాను బుల్లెట్‌ గాయంతో మరణించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments