Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచింగ్‌కు వెళుతున్న బీటెక్ విద్యార్థినిని కొండపైకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్...

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. కోచింగ్‌ కోసం రోడ్డుపై నడిచి వెళుతున్న బీటెక్ విద్యార్థినిని కొందరు దుండగులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆగ్రాకు చెందిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో కోచింగ్‌కు వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై అటకాయించారు. అనంతరం ఆమెను బలవంతంగా యమునా నది తీరంలో ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఆ యువతిని తీవ్రంగా గాయపరిచి అక్కడ నుంచి పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి జారుకుంది. రాత్రి అవుతున్నా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ పరిస్థితుల్లో స్పృహలోకి వచ్చిన యువతి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదుచేశారు. అనంతరం యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం