Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోచింగ్‌కు వెళుతున్న బీటెక్ విద్యార్థినిని కొండపైకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్...

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (14:07 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో దారుణం జరిగింది. కోచింగ్‌ కోసం రోడ్డుపై నడిచి వెళుతున్న బీటెక్ విద్యార్థినిని కొందరు దుండగులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆగ్రాకు చెందిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో కోచింగ్‌కు వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై అటకాయించారు. అనంతరం ఆమెను బలవంతంగా యమునా నది తీరంలో ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత ఆ యువతిని తీవ్రంగా గాయపరిచి అక్కడ నుంచి పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి జారుకుంది. రాత్రి అవుతున్నా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 
 
ఈ పరిస్థితుల్లో స్పృహలోకి వచ్చిన యువతి ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదుచేశారు. అనంతరం యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం