Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ డబ్బు ఇవ్వగానే ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ : కేంద్ర మంత్రి

Ramdas Athawale
Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (13:55 IST)
భారత రిజర్వు బ్యాంకును డబ్బులు అడిగామని, ఆ నగదు ఇవ్వగానే ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను జమ చేస్తామని కేంద్ర మంత్రి రాందాస్ అథావలే చెప్పుకొచ్చారు. అయితే, రూ.15 లక్షలను ఒకేసారి జమ చేయలేమని దశలవారీగా జమ చేస్తామని తెలిపారు. 
 
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో విదేశాల్లో మగ్గుతున్న భారతీయుల నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు చొప్పున జమ చేస్తామంటూ నాడు బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. నాలుగున్నరేళ్ళు గడుస్తున్నా ఆ హామీని మాత్రం నెరవేర్చలేదు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 
వీటిపై కేంద్ర మంత్రి అథావలే స్పందిస్తూ, ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ప్రజలకు ఒక్కసారిగా ఇవ్వడానికి అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని వ్యాఖ్యానించారు. సాయం చేయాలని రిజర్వు బ్యాంకును కోరినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.
 
ఒకవేళ అంత మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు ముందుకొచ్చినా, ప్రజలకు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయన్నారు. ఒకవేళ తాము అడిగిన నిధులను ఆర్బీఐ ఇస్తే మాత్రం దశల వారీగా రూ.15 లక్షలను డిపాజిట్ చేస్తామని మంత్రి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments