రాళ్ళు రువ్వి మనుషుల ప్రాణాలు తీస్తే స్వాతంత్ర్యం రాదు : బిపిన్ రావత్

అల్లర్లకు పాల్పడే కాశ్మీర్ యువతకు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఓ సూచన చేశారు. తీవ్రవాదుల ప్రలోభాలకు లొంగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అలాగే, రాళ్లు రువ్వి మనుషులు ప్రాణాలు తీస్తే స్వా

Webdunia
గురువారం, 10 మే 2018 (13:04 IST)
అల్లర్లకు పాల్పడే కాశ్మీర్ యువతకు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఓ సూచన చేశారు. తీవ్రవాదుల ప్రలోభాలకు లొంగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అలాగే, రాళ్లు రువ్వి మనుషులు ప్రాణాలు తీస్తే స్వాతంత్ర్యం రాదని ఆయన అల్లరి మూకలకు హెచ్చరికలు చేశారు.
 
ఉగ్ర గ్రూపులు కొత్తగా ఉగ్రవాదులను చేర్చుకునే పనిలో ఉన్నాయని, యువత ఆ మార్గాన్ని ఎంచుకోరాదని కోరారు. ఎంతమంది ఉగ్రవాదులను చంపామన్న లెక్కలను తామెన్నడూ పరిగణనలోకి తీసుకోలేదని, భవిష్యత్తులోనూ ఇదే జరుగుతుందని చెప్పారు. ఇదే సమయంలో ఎవరినీ చంపాలన్న ఉద్దేశం తమకు ఉండదని, ఆయుధాలతో ఎవరు కనిపించినా, ముందుగా లొంగిపోవాలనే హెచ్చరిస్తామని తెలిపారు. 
 
పొరుగు దేశమైన పాకిస్థాన్, సిరియా వంటి దేశాల్లో ఉండే పరిస్థితులు దారుణంగా ఉన్నాయనీ, దీంతో అక్కడి ప్రభుత్వాలు, సైన్యం ట్యాంకులు, యుద్ధ విమానాలను వాడుతోందని ఆయన గుర్తు చేశారు. కానీ, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత దిశగా ఇంతవరకూ ఒక్కసారి కూడా యుద్ధ విమానాన్ని వాడలేదని ఆయన తెలిపారు. ఇక్కడి యువతలో కోపముందన్న సంగతి తనకు తెలుసునని, హింసా మార్గంలో వెళితే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్న సంగతిని మరువరాదని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments