Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు వ్యతిరేకించే ఆహారాన్నే వాజ్‌పేయి ఇష్టంగా తినేవారు : గోవా పీసీసీ చీఫ్

గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:27 IST)
గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధాని వాజ్‌పేయి అమిత ఇష్టంగా ఆరగించేవారనీ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన పనాజీలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్న ఆహారాన్ని మాజీ ప్రధాని వాజపేయి ఎంతో ఇష్టంగా తినేవారని చెప్పారు. నిజానికి వాజ్‌పేయి మరికొన్ని సంవత్సరాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నట్టయితే దేశ ముఖచిత్రం మరోలా ఉండేదన్నారు. 
 
ఇపుడు మతం పేరుతో ప్రజల్ని విభజించే చర్యలను ఆయన అడ్డుకునేవారు. ప్రజలు ఏం తినాలి.. ఏం తినకూడదు అంటూ ఆదేశించే వ్యక్తుల ఆటలను వాజపేయి ఏ మాత్రం సాగనిచ్చేవారు. ప్రస్తుతం ఏదైతే తినకూడదని వీళ్లు (బీజేపీ) చెబుతున్నారో.. వాటిని ఆయన ఇష్టపూర్వకంగా తినేవారు. తాను ఏం తింటున్నాననే విషయాన్ని ధైర్యంగా ఆయన చెప్పుకునేవారు అని గిరిష్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments