Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు వ్యతిరేకించే ఆహారాన్నే వాజ్‌పేయి ఇష్టంగా తినేవారు : గోవా పీసీసీ చీఫ్

గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (10:27 IST)
గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ చీఫ్) గిరిష్ ఛోడాంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతలు ఏ ఆహారాన్నైతే తినొద్దంటూ దాడులు చేస్తున్నారో ఆ ఆహారాన్నే మాజీ ప్రధాని వాజ్‌పేయి అమిత ఇష్టంగా ఆరగించేవారనీ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన పనాజీలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్న ఆహారాన్ని మాజీ ప్రధాని వాజపేయి ఎంతో ఇష్టంగా తినేవారని చెప్పారు. నిజానికి వాజ్‌పేయి మరికొన్ని సంవత్సరాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నట్టయితే దేశ ముఖచిత్రం మరోలా ఉండేదన్నారు. 
 
ఇపుడు మతం పేరుతో ప్రజల్ని విభజించే చర్యలను ఆయన అడ్డుకునేవారు. ప్రజలు ఏం తినాలి.. ఏం తినకూడదు అంటూ ఆదేశించే వ్యక్తుల ఆటలను వాజపేయి ఏ మాత్రం సాగనిచ్చేవారు. ప్రస్తుతం ఏదైతే తినకూడదని వీళ్లు (బీజేపీ) చెబుతున్నారో.. వాటిని ఆయన ఇష్టపూర్వకంగా తినేవారు. తాను ఏం తింటున్నాననే విషయాన్ని ధైర్యంగా ఆయన చెప్పుకునేవారు అని గిరిష్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments