Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారుడు కాదు... హృదయాలను గెలుచుకున్న రియల్ హీరో

కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాట

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (09:01 IST)
కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు చిక్కుకున్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) జవాన్లు ఈ ప్రాంతానికి వెళ్లలేమన్నారు.
 
కానీ, స్థానిక మత్స్యకారుడు కేపీ జైసాల్ (32) వారిని కాపాడటానికి ముందుకొచ్చారు. సదరు మహిళలు ఎన్డీఆర్‌ఎఫ్ బెలూన్ బోటులోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే జైసాల్ తన వీపును మెట్టుగాచేసి బోటులోకి వెళ్లేందుకు వీలుగా కిందకు వంగారు. ఒకరి తర్వాత మరొకరు అతడి వీపుపై కాలుపెట్టి బోటులోకి వెళ్లిపోయారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. కేవలం జైసాల్ ఒక్కరే కాదు వందల మంది మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న తోటి వారిని కాపాడేందుకు తమ బోట్లను ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర సహాయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. బాధితులను రక్షించడంలో ఎన్డీఆర్‌ఎఫ్ జవాన్లకు సాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments