Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారుడు కాదు... హృదయాలను గెలుచుకున్న రియల్ హీరో

కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాట

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (09:01 IST)
కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు చిక్కుకున్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) జవాన్లు ఈ ప్రాంతానికి వెళ్లలేమన్నారు.
 
కానీ, స్థానిక మత్స్యకారుడు కేపీ జైసాల్ (32) వారిని కాపాడటానికి ముందుకొచ్చారు. సదరు మహిళలు ఎన్డీఆర్‌ఎఫ్ బెలూన్ బోటులోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే జైసాల్ తన వీపును మెట్టుగాచేసి బోటులోకి వెళ్లేందుకు వీలుగా కిందకు వంగారు. ఒకరి తర్వాత మరొకరు అతడి వీపుపై కాలుపెట్టి బోటులోకి వెళ్లిపోయారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. కేవలం జైసాల్ ఒక్కరే కాదు వందల మంది మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న తోటి వారిని కాపాడేందుకు తమ బోట్లను ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర సహాయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. బాధితులను రక్షించడంలో ఎన్డీఆర్‌ఎఫ్ జవాన్లకు సాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments