Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:54 IST)
రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేసినట్టు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు సచిన్ పైలట్ సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఐసీసీ శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ పేరును గురువారం రాత్రి ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం... రాజస్థాన్ సీఎం విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగించింది. రాజస్థాన్ సీఎం పదవి కోసం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 
 
సీఎం పగ్గాలు తమ నాయకుడికే ఇవ్వాలంటూ వారివారి మద్దతుదారులు డిమాండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ మద్దతుదారులైతే రెండు బస్సులకు కూడా నిప్పుపెట్టారు. దీంతో తమ మద్దతుదారులు సంయమనం పాటించాలని వారు కోరారు.
 
ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం ఎంపికపై పలువురు పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... సీఎంగా అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గుచూపినట్టు సమాచారం. అశోక్ గెహ్లాట్‌కున్న సుదీర్ఘ అనుభవం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments