Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (15:54 IST)
రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పేరును ఖరారు చేసినట్టు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. అలాగే, ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు సచిన్ పైలట్ సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏఐసీసీ శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ పేరును గురువారం రాత్రి ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం... రాజస్థాన్ సీఎం విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగించింది. రాజస్థాన్ సీఎం పదవి కోసం సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 
 
సీఎం పగ్గాలు తమ నాయకుడికే ఇవ్వాలంటూ వారివారి మద్దతుదారులు డిమాండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ మద్దతుదారులైతే రెండు బస్సులకు కూడా నిప్పుపెట్టారు. దీంతో తమ మద్దతుదారులు సంయమనం పాటించాలని వారు కోరారు.
 
ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం ఎంపికపై పలువురు పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... సీఎంగా అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గుచూపినట్టు సమాచారం. అశోక్ గెహ్లాట్‌కున్న సుదీర్ఘ అనుభవం ఆయనకు ప్లస్ అయినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments