Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుదీర్ఘకాల బాధ ముగిసింది... కుమార్తె ఫోటోను హత్తుకుని....

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (07:35 IST)
తన సుదీర్ఘకాల బాధ ముగిసిందంటూ తన కుమార్తె నిర్భయ ఫోటోను హత్తుకున్నానని నిర్భయ తల్లి ఆశాదేవి ఉద్వేగపూరిత స్వరంతో చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదన్నారు. ఇప్పటివరకు తాను చేసిన పోరాటం నిర్భయ కోసమని, ఇకపై మన కుమార్తెల కోసం పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు. 
 
నిర్భయ అత్యాచార కేసులో నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్షలను తీహార్ జైలులో అమలు చేసిన విషయం తెల్సిందే. ఈ శిక్షల తర్వాత ఈ నలుగురు చనిపోయారని వైద్యులు ధృవీకరించిన తర్వాత ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. 
 
నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు. తన కుమార్తె లేదని, ఇకపై రాదని పేర్కొన్న ఆమె.. కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు తమ పోరాటం నిర్భయ గురించేనని, ఇకపై 'మన కుమార్తె'ల కోసం పోరాడతానని చెప్పారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగపూరిత కంఠంతో చెప్పారు.
 
మొత్తానికి వారికి ఉరిపడిందని పేర్కొన్న ఆశాదేవి.. ఇదో సుదీర్ఘకాల బాధ అని అన్నారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments