Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మలను ఈ జన్మలో ఓడించలేరు - కేజ్రీవాల్ : పాత వీడియో వైరల్

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (17:52 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికాగా, ఈ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ ఘన విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో గతంలో గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయింది. ఈ జన్మకు తమను ఓడించలేరంటూ ఆయన చేసిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. 
 
గతంలో ఓ ప్రచార వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, 'మోడీజీ.. మమ్మల్ని ఓడించడం మీకు ఈ జన్మలో సాధ్యంకాదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం మీ వల్ల కాదు" అంటూ వ్యాఖ్యానించారు. కాగా, తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఆప్ చిత్తుగా ఓడిపోవడంతో ఈ వైరల్‌ను షేర్ చేసి వైరల్ చేశారు. 
 
అలాగే, కొందరు నెటిజన్లు ఈ వీడియోకు మీమ్స్ జతచేసి పోస్ట్ చేయడంతో అవి కూడా వైరల్‌గా మారాయి. కేజ్రీవాల్ మాట్లాడిన మాటల తర్వాత వీడియోకు మీమ్స్ జతచేశారు. కేజ్రీవాల్‌ను రాహుల్ గాధీ ఆపుతున్నట్టు, మాట్లాడొద్దు, సైలెన్స్‌గా ఉండు అన్నట్టు మీమ్స్ జతచేశారు. ఆప్‌ను ఓడించడానికి వచ్చే జన్మ వరకు ఎందుకు... ఇపుడే ఓడించామంటూ బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోను వైరల్ చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ మినహా ఆప్‌కు చెందిన కీలక నేతలంతా ఓడిపోయిన విషయం తెల్సిందే. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments