Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆప్‌కు తగ్గిన 10 శాతం ఓట్లు.. కోల్పోయిన సీట్లు 40

Advertiesment
delhi election results

ఠాగూర్

, ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (16:36 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఏకంగా 48 సీట్లను కైవసం చేసుకుని అధికారం చేపట్టనుంది. మరోవైపు, గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోయి కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలకు షేర్ అయిన ఓట్లను పరిశీలిస్తే.. బీజేపీకి ఏడు శాతం ఓట్లు పెరిగాయి. ఆప్‌కు పది శాతం ఓట్లు తగ్గాయి. ఇదే ఆ పార్టీ కొంప ముంచాయి. ఓట్ల శాతం తగ్గిపోవడంతో ఆప్‌కు 401 సీట్లు తగ్గి  బీజేపీకి పెరిగాయి. ఫలితంగా కమలనాథులు 23 యేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చారు. 
 
గత 2015, 2020, 2025 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఎన్నికల్లో బీజేపీకి 45.76 శాతం ఓట్లు పోలుకాగా, కాంగ్రెస్ పార్టీకి కేవం 6.36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.  ఆ పార్టీకి పది శాతం ఓట్లు తగ్గాయి. 
 
2020 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.51 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఏడు శాతానికి పైగా పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ గత ఎన్నికల్లో ఏకంగా 53.57 శాతం ఓట్లను దక్కించుకోగా, ప్రస్తుతం ఆ పార్టీ పది శాతం ఓటు బ్యాంకును కోల్పోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో 4.26 శాతంగా ఉండగా, ఇపుడది 6.36 శాతానికి పెరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ఉద్యోగం కోసం రూ.15 లక్షలు ఖర్చు చేసిన భర్త.. జాబ్ రాగానే హ్యాండిచ్చిన భార్య... ఆ తర్వాత...