Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతిండియాలో ఎక్కడైనా.. ఎపుడైనా ఉగ్రదాడి జరగొచ్చు : ఆర్మీ హెచ్చరిక

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (16:21 IST)
దక్షిణ భారతదేశంలో ఎపుడైనా, ఎక్కడైనా దాడి జరగొచ్చని ఆర్మీ హెచ్చరించింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడే అవకాశం ఉందని లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ హెచ్చరించారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఉగ్రదాడి జరిగే అవకాశముందని తమకు నిఘా సమాచారం అందిందని ఆర్మీ సదరన్ కమాండ్‌కు చెందిన లెఫ్లినెంట్ జనరల్ ఎస్కే సైనీ తెలిపారు. భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న సర్ క్రీక్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని వెల్లడించారు. ఈ పడవుల ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడివుంటారని తాము అనుమానిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఎలాంటి ఉగ్రదాడి, దుశ్చర్య జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2008, నవంబర్ 26న ఇదే తరహాలో సముద్ర మార్గం ద్వారా  ముంబైకి చేరుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు మహానగరంలో మారణహోమం సృష్టించిన విషయం తెల్సిందే. 
 
ఈ దుర్ఘటనలో 140 మంది భారతీయులు, 25 మంది విదేశీ పర్యాటకులతో సహా 9 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాది కసబ్‌ సజీవంగా పట్టుబడగా అతనికి ఉరిశిక్ష అమలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments