Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్... పరిస్థితేంటి?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:51 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని కాట్టేరి అనే అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది వరకు ప్రయాణించినట్టు సమాచారం. వీరిలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు. 
 
ఈ హెలికాఫ్టర్ కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బయలుదేరింది. అయితే, ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కాట్టేరి అనే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ కాలిబూడిదైంది. అయితే, ఈ హెలికాఫ్టర్‌లో ఉన్న ఆర్మీ అధికారుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ముఖ్యంగా, బిపిన్ రావత్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.
 
గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకునివుంది. దీనికితోడు హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆర్మీ అధికారులు తప్పించుకున్నారా లేదా అనేది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments