కుప్పకూలిన హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్... పరిస్థితేంటి?

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:51 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని కాట్టేరి అనే అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది వరకు ప్రయాణించినట్టు సమాచారం. వీరిలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు. 
 
ఈ హెలికాఫ్టర్ కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బయలుదేరింది. అయితే, ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కాట్టేరి అనే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ కాలిబూడిదైంది. అయితే, ఈ హెలికాఫ్టర్‌లో ఉన్న ఆర్మీ అధికారుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ముఖ్యంగా, బిపిన్ రావత్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.
 
గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకునివుంది. దీనికితోడు హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆర్మీ అధికారులు తప్పించుకున్నారా లేదా అనేది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments