Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంటల్లో చిక్కుకున్న బల్గేరియా బస్సు-45మంది సజీవదహనం

మంటల్లో చిక్కుకున్న బల్గేరియా బస్సు-45మంది సజీవదహనం
, మంగళవారం, 23 నవంబరు 2021 (15:56 IST)
బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 45మంది సజీవదహనం అయ్యారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా ఈ బస్సు మంటల్లో చిక్కుకుంది. 
 
ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.  ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాసిడోనియా రాయబార కార్యాలయం ప్రతినిధులు బాధితులను తీసుకెళ్లిన ఆసుపత్రిని సందర్శించారని బల్గేరియన్ వార్తా సంస్థ నోవినిట్ తెలిపింది. ప్రమాదానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విస్టాడోమ్ కోచ్‌లతో అరకు స్పెషల్ ట్రైన్ - ప్రారంభించిన ఉపరాష్ట్రపతి