Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాణ స్వీకార సమయంలోనే అనారోగ్యంతో జయలలిత

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (17:14 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చనిపోయారు. ఆమె 60 రోజులకుపైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొంది తుదిశ్వాస విడిచారు. అయితే, ఆమె మృతిపై పలు సందేహాలు ఉత్పన్నమయ్యాయి. వీటిపై నిగ్గు తేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు దఫాలుగా విచారణ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో జయలలితకు చికిత్స చేసిన వైద్యుల్లో ఒకరైన అపోలో డాక్టర్ బాబు మనోహర్ సంచలన విషయాలను జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు వెల్లడించారు. 
 
2016లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే జయలలిత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని, ఆమె తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చేదని తెలిపారు. దీంతో జయలలితను మరింత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేశామని తెలిపారు. రోజుకు 16 గంటల పాటు పని చేస్తున్నందున విశ్రాంతి తీసుకోవడం చాలా కష్టమని జయలలిత చెప్పారని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమెకు డిసెంబరు 5వ తేదీ 2016న గుండెపోటు వచ్చి మరణించారని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments