Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిజాబ్ ధరించి వచ్చి ఓటేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్న బీజేపీ ఏజెంట్

హిజాబ్ ధరించి వచ్చి ఓటేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్న బీజేపీ ఏజెంట్
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:57 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అంతా ప్రశాంతంగా సాగుతుందని భావించిన తరుణంలో మదురైలో హిజాబ్ వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి హిజాబ్ ధరించి వచ్చిన ఓ ముస్లిం మహిళను ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థి తరపు ఏజెంట్ అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. 
 
హిజాబ్ తొలగించిన తర్వాత తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని, అపుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్‌ బూత్‌లో వీరంగం సృష్టించాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర పోలింగ్ ఏజెంట్లు సదరు బీజేపీ ఏజెంట్‌ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ ఏజెంట్‌ను బయటకు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఓటు హక్కును వినియోగించుకుంది. కాగా, కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ వివాదం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది. ఇపుడు తమిళనాడు ఎన్నికల్లో ఈ వివాదం తలెత్తింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, గర్భవతినయ్యానని చెబితే పంచాయతీ పెట్టాడు, ఆ తర్వాత?