Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (06:09 IST)
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కేసీ రామమూర్తి బుధవారంనాడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. రామమూర్తి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో, కాంగ్రెస్‌కు చెందిన భువనేశ్వర్ కలిత, సంజయ్ సింగ్‌ సైతం రాజ్యసభకు రాజీనామా చేశారు.

అలాగే బీజేపీలో చేరేందుకు వీలుగా నీరజ్ శేఖర్, సురేంద్ర సింగ్ నెగర్, సంజయ్ సేథ్‌లు ఇటీవల సమాజ్‌వాదీ పార్టీని, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని వీడారు. ఆ తర్వాత బీజేపీ టిక్కెట్‌పై వీరంతా పోటీ చేసి తిరిగి ఎన్నికయ్యారు.

దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. గత జూన్‌లో నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు సైతం బీజేపీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments