Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో బీజేపీకి మరో భారీ షాక్‌

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:39 IST)
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. బీజేపీ బాగ్డా ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ టీఎంసీకి పార్టీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎమ్మెల్యే అదే బాట పట్టడం విశేషం.
 
బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బెంగాల్‌ టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూసుకుపోతున్న తరుణంలో  ఈ కీలక పరిణామం  చోటు చేసుకుంది.

బీజేపీ సీనియర్లు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్ తరువాత, ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్‌ మంగళవారం కోల్‌కతాలో టీఎంసీ కండువా కప్పుకున్నారు.

కొన్ని అపార్థాల కారణంగా గతంలో కొన్ని మార్పులు జరిగాయని కానీ తిరిగి తన ఇంటికి చేరుకున్నానంటూ ఈ సందర్భంగా బిశ్వజిత్‌ సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తన సేవలు కొనసాగుతాయన్నారు.
 
కాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అనూహ్యంగా విజయాన​న్ని సొంతం చేసుకుంది.

దీంతో ఈ ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదనే అంచనాలతో టీఎంసీ నుంచి బీజేపీలోకి జంప్‌ చేసిన పలువురు నేతలు తాజాగా  టీఎంసీ బాటపడుతున్నారు. ఇప్పటికే ముకుల్ రాయ్ తోపాటు కొంతమంది సీనియర్‌  నేతలు టీఎంసీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోక్షజ్ఞ తొలి సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments