Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌పాల్ కోసం మళ్లీ నిరాహారదీక్ష : అన్నా హజారే ప్రకటన

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (16:25 IST)
లోక్‌పాల్ నియామకం కోసం ఈనెల 30వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేయనున్నట్టు ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే ప్రకటించారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతోంది. 
 
ఇందులో అన్నా హజారే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌పాల్‌, లోకాయుక్త 2013లో తయారైంది. 2014లో చట్టరూపం దాల్చింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రకటించారని గుర్తుచేశారు. 
 
కానీ, అదే యేడాదిలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎంతో కొంత దీనిపై ముందడుగు పడుతుందని ఆశించాం. కానీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు. అధికారం చేపట్టి ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. ఇందుకు నిరసనగా తాను ఈ నెల 30వ తేదీ నుంచి తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
ఆ తర్వాత హెచ్‌ఐసీసీ సదస్సులో మాట్లాడుతూ, ఒక యేడాది, ఐదేళ్లు, పదేళ్లు ప్రాతిపదికగా లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. యువశక్తి సరికొత్త దిశగా ప్రయాణించి అద్భుతాలు సృష్టించాలని కోరారు. జీవింతలో సాధించాల్సిన లక్ష్యాలపై ముందే స్పష్టత ఉండాలన్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దన్నారు. నిరంతరం నేర్చుకోవాలనే జిజ్ఞాస కూడా యువతలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments