Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ రష్మీ గౌతమ్ ఫైర్.. వాటిని కోసేయాలి..(video)

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:35 IST)
బీహార్‌లోని బాగల్‌పూర్ జిల్లాలో ఓ బాలికపై రేపిస్ట్‌లు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. పదహారేళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంట్లోకి శుక్రవారం నలుగురు దుండగులు చొరబడ్డారు. బాలిక తల్లిని గన్‌తో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి యత్నించారు. అయితే బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. ఘటనపై కేసు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఘటనపై జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. యాసిడ్ దాడులపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే రష్మీ గౌతమ్.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మండిపడింది. ముఖ్యంగా తాజాగా బీహార్‌లో జరిగిన ఓ కీచక పర్వంపై స్పందించింది. 
 
ఈ మేరకు సోషల్ మీడియాలో రష్మీ పోస్టు చేసింది. రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోంది. మగాళ్లమని రెచ్చిపోతూ అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల పురుషాంగాలను కోసేయాలి. లేదంటే ఒక్క రాత్రిలోనే స్త్రీ జాతి అంతరించిపోతుంది. అలా చేసినప్పుడే మానవాళికి మహిళ విలువ తెలుస్తుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 
 
రష్మీ గౌతమ్ ట్వీట్‌కు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడుతూ.. పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రష్మీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments