Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

సెల్వి
సోమవారం, 5 మే 2025 (19:16 IST)
Tandoori Roti
ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో ఒక వివాహానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే, తందూరీ, రోటీల విషయంలో జరిగిన చిన్న వివాదం ఇద్దరు యువకుల దారుణ మరణానికి దారితీసింది. వివాహ కార్యక్రమంలో భాగంగా ఒక ఫుడ్ స్టాల్ వద్ద జరిగిన మాటల ఘర్షణలో 17 ఏళ్ల ఆశిష్, 18 ఏళ్ల రవిని కొట్టి చంపేశారు. 
 
ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆశిష్, రవి తందూరి రోటీ కౌంటర్ వద్ద ఆహారం కోసం క్యూలో నిలబడ్డారని పోలీసులు తెలిపారు. వారికి వరుడి బంధువు రోహిత్, అతని కొంతమంది స్నేహితులు, ఇతర అతిథుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రోహిత్ బృందం జరిగిన వివాదాన్ని అవమానంగా భావించారు. 
 
అంతే పెళ్లి నుండి స్నేహితుల బృందంతో బయటకు వెళ్ళిన తర్వాత, రోహిత్, అతని సహచరులు ఇనుప రాడ్లు, హాకీ స్టిక్స్, లాఠీలతో ఆశిష్, రవిలను వెంబడించారని తెలుస్తోంది. ఆపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో ఆశిష్, రవి ప్రాణాలు కోల్పోయారు.  
 
ఆశిష్, రవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 13 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనుమానితులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఇతరులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అమేథి అదనపు ఎస్పీ హరేంద్ర కుమార్ ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments