Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (08:45 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌పై కేసు నమోదుకు బెంగుళూరు కోర్టు ఆదేశించింది. పార్టీ నిధుల కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల నుంచి బెదిరించి, వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల్ పేరిట బీజేపీ పార్టీ అధికారిక ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో ఆరోపించారు. ఇవి ముమ్మాటికీ నిజమనే పేర్కొంటూ ఆయన తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాలా సీతామన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని బెంగుళూరులోని తిలక్ నగర్ ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, ఆదర్శ్ అయ్యర్ నిర్మలపై కేసు నమోదు చేయాలని కోరగా వారు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. కేంద్రమంత్రి నిర్మలమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికైనా పోలీసులు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments