ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

ఠాగూర్
శనివారం, 26 జులై 2025 (08:21 IST)
అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషాదకర ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన అనేక విమానాల్లో సాంకేతిక సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రతి ఏదో ఒక విమానంలో సాంకేతిక లోపం తలెత్తుతోంది. ఈ లోపాన్ని పైలెట్లు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. 
 
తాజాగా జైపూర్ నుంచి ముంబైకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన పైలెట్లు టేకాఫ్ అయిన 18 నిమిషాల్లోనే విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం సురక్షితంగా టేకాఫ్ అయిన ప్రదేశంలోనే ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది, ఇద్దరు పైలెట్లు, కొందరు వైద్య విద్యార్థులంతా కలిసి దాదాపు 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
కొద్ది రోజుల క్రితం 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు అధికారులు వెల్లడించారు. మరో సంఘటనలో హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానం ఏ1 315 ల్యాండింగ్ అయిన వెంటనే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments