వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

ఠాగూర్
శనివారం, 26 జులై 2025 (08:00 IST)
ఆధునిక సమాజంలో మూఢ నమ్మకాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇక్కడ ఉన్న అనేక కొండ ప్రాంత గ్రామాల్లో వింత ఆచారాలను ఆ ప్రాంత ప్రజలు పాటిస్తుంటారు. తాజాగా ఓ వింత ఆచారం ఒకటి వెలుగు చూసింది. ఒక ఆలయ పూజారికి కారం నీళ్లతో అభిషేకం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉండే పెరియకరుప్పు ఆలయంలో ఈ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. యేటా ఆడి అమావాస్య సందర్భంగా ఆలయ పూజారికి ఇలా కారం, పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్లతో అభిషేకించడం జరుగుతుంది. 
 
ఇందులోభాగంగా, గురువారం ఆడి అమావాస్య రావడంతో 108 కిలోల కారం, ఆరు కిలోల పచ్చి మిరపకాయలు కలిపిన నీళ్ళతో పూజారి గోవింద్‌కు అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక అభిషేకంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భక్తులకు ఆలయ ప్రాంగణంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమని స్థానిక భక్తులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments