Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌న్‌వేపై జారిన విమానం.. ముక్కు భాగం టైర్ పగిలింది

కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానాశ్ర‌యంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే ట్రాక్‌పై నుంచి ప‌క్క

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:49 IST)
కొచ్చిన్ ఎయిర్‌పోర్టులో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిరిండియాకు చెందిన విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విమానాశ్ర‌యంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే ట్రాక్‌పై నుంచి ప‌క్క‌కు దిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులంతా సుర‌క్షితంగా ఉన్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 102 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు. 
 
అబుదాబి నుంచి కొచ్చికి వ‌చ్చిన ఎయిరిండియా విమానం ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమానం పార్కింగ్ ఏరియాకు వస్తుండగా, ర‌న్‌వే ట్రాక్ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. మంగళవారం వేకువజామున 2.40 నిమిషాల‌కు ఈ సంఘట‌న జ‌రిగింది. 
 
ఆ స‌మ‌యంలో విమానాశ్ర‌య ప్రాంతంలో వ‌ర్షం ప‌డుతున్న‌ట్లు అధికారులు చెప్పారు. అయితే నిచ్చెన సాయంతో ప్ర‌యాణికులు విమానం దిగారు. బోయింగ్ 373-800 విమానానికి చెందిన ముక్కు భాగం టైర్ ప‌గిలిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌నపై విమానాశ్రయ అధికారులు విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments