ఆ ఒక్కడు మినహా మిగిలిన వారంతా చనిపోయారు... ఎయిరిండియా

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (09:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది చనిపోయారని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్‌ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిరిడియాకు చెందిన బోయింగ్ ఏఐ171 రకం విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే జనావాస ప్రాంతాలపై కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారని, ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అదృష్టవశాత్తు ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. 
 
కాగా, 12 యేళ్లనాటి బోయింగ్ 787-8 డ్రీమ్ విమానం గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి సమీపంలోని ఒక హాస్టల్ భవనంపై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 
 
వీరిలో 139 మంది భారత పౌరులు కాగా, 53 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ వారు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో సజీవంగా బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటీష్  జాతీయుడుని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎయిరిండియా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments