Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర పెళ్లి చేసుకున్న యువతి.. 40 మందికి శిరోమండనం చేసిన గ్రామపెద్దలు!

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (08:56 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కులాంతర వివాహం చేసుకోవడాన్ని గ్రామపెద్దలు సహించలేకపోయారు. గ్రామ కట్టుబాట్ల మేరకు ఆ యువతి కుటుంబ సభ్యులను గ్రామం నుంచి వెలివేస్తామని హెచ్చరించారు. దీనికి శిక్షగా యువతి కుటుంబానికి చెందిన 40 మందికి శిరోమండనం చేశారు. అలాగే, మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యంగా, పెళ్లి చేసుకున్న యువజంటకు పెద్దకర్మ కూడా కుటుంబ సభ్యులతో నిర్వహించడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒరిస్సా రాష్ట్రంలోని కాశీపూర్ సమితి గోరఖ్‌పూర్ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి అదే ప్రాంతానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరి కుటుంబానికి కుటుంబ పెద్దలు అంగీకరించలేదు. అయితే, మూడు రోజుల క్రితం ఆ జంట గ్రామం నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గురువారం ఈ జంట తిరిగి గ్రామానికి తిరిగి వచ్చింది. ఈ విషయం గ్రామపెద్దలకు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కులాంతర వివాహం చేసుకున్నారంటూ మండిపడుతూ, యువతి కుటుంబ సభ్యులను గ్రామం నుంచి వెలివేశారు. 
 
అదేసమయంలో గ్రామ బహిష్కరణ నుంచి బయటపడాలంటే గ్రామ కట్టుబాట్లను పాటించాలని ఆదేశించారు. ఇందులోభాగంగా, యువతి కుటుంబ సభ్యులు, బంధువుల్లోని పురుషులు శిరోమండనం చేసుకోవాలని, మూగ జీవాలను బలివ్వాలని, అలాగే, నూతన దంపతులకు పెద్దకర్మ చేయాలని తీర్పునిచ్చారు. 
 
గ్రామ పెద్దల ఆదేశాలు, హెచ్చరికలకు భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు, వారి బంధువులు 40 మంది పురుషులు గుండు గీయించుకున్నారు. ఆ తర్వాత మేక, గొర్రె, కోడి, పావురాలను బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతికున్న తమ కుమార్తెకు పెద్దకర్మ కూడా నిర్వహించారు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు కిమ్మనకుండా ఉండిపోయారు. వారిని అడిగితే తమకు ఎలాంటి సమాచారం లేదని చేతులు దులుపుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments