అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 171లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వారు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు.
అహ్మదాబాద్ నుండి గురువారం మధ్యాహ్నం 3.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని ఎయిర్ ఇండియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపింది.
వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు వున్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
మరిన్ని సమాచారం అందించడానికి తాము 1800 5691 444 అనే ప్రత్యేక ప్రయాణీకుల హాట్లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేసామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా కూడా తెలిపింది.